Railway Ticket: రైల్వే టికెట్ రీఫండ్ నిబంధనల్లో మార్పులు ప్రయాణికులకు అదనపు భారం అవుతాయనే ప్రచారం నేపథ్యంలో రైల్వే శాఖ స్పష్టత ఇచ్చింది. ఈ మార్పులు ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచడానికే తీసుకువచ్చినవని తెలిపింది. ముఖ్యంగా టికెట్ కన్ఫర్మేషన్, చార్ట్ తయారీ సమయాల్లో చేసిన మార్పులతో ప్రయాణికులకు ముందుగానే సమాచారం అందేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
1. రీఫండ్ నిబంధనలపై క్లారిటీ
రైల్వే శాఖ టికెట్ రీఫండ్ నిబంధనల్లో మార్పులు ప్రయాణికులకు అదనపు భారం కాదని స్పష్టం చేసింది. ప్రయాణికులకు మరింత పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపింది.
2. చార్ట్ తయారీ సమయం పెంపు
ఇంతకుముందు రైలు బయలుదేరే 4 గంటల ముందు చార్ట్ తయారు చేసేవారు. ఇప్పుడు దాన్ని 9 నుంచి 18 గంటల ముందే సిద్ధం చేసేలా మార్పు చేశారు.
3. ప్రయాణికులకు ముందస్తు సమాచారం
చార్ట్ ముందుగానే సిద్ధం కావడంతో టికెట్ కన్ఫర్మేషన్ గురించి ప్రయాణికులు ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇది ఉపయోగపడుతుంది.
4. అక్రమ టికెట్ ఏజెంట్లపై నియంత్రణ
ఈ కొత్త విధానంతో అక్రమ టికెట్ ఏజెంట్ల కార్యకలాపాలను కూడా నియంత్రించవచ్చని రైల్వే శాఖ తెలిపింది.
5. బోర్డింగ్ పాయింట్ మార్పు, బోగీ అప్గ్రేడ్ అవకాశం
ప్రయాణికులు ఇప్పుడు రైలు బయలుదేరే చివరి 30 నిమిషాల వరకు బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే అవకాశం పొందారు. అలాగే సీట్లు ఖాళీగా ఉంటే బోగీని కూడా అప్గ్రేడ్ చేసుకునే వీలుంది.
ఇవీ చదవండి: Inter Hall Tickets 2026: ఇంటర్ విద్యార్థులకు కీలక అలర్ట్.. హాల్టికెట్లో పొరపాట్లు ఉంటే ఇలా సరిచేసుకోండి
Railway Recruitment Board: ఆర్ఆర్బీ పారామెడికల్ పరీక్ష ఆన్సర్ కీ విడుదల.. అభ్యర్థులకు కీలక సూచనలు
Railway Jobs 2026: రైల్వేలో 2,801 అప్రెంటిస్ పోస్టులు.. పరీక్ష లేకుండానే ఎంపిక, వెంటనే దరఖాస్తు చేయండి
