HomeAndhra PradeshAndhra Pradesh : వర్షం పడేటప్పుడు చెట్లకింద నిలబడరాదు.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు

Andhra Pradesh : వర్షం పడేటప్పుడు చెట్లకింద నిలబడరాదు.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు

Andhra Pradesh : అల్పపీడనం,ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.

అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికి గుంటూరులో 81మిమీ, పల్నాడు జిల్లా తుర్లపాడులో 54.5మిమీ, పెద్దకూరపాడులో 40.2మిమీ, గుంటూరు జిల్లా వంగిపురంలో 39.5మిమీ, కోనసీమ జిల్లా ముక్కములలో 39మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

ఇవీ చదవండి: Heavy Rain Alert: తెలంగాణలో నేడు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు
Andhra Rains: ఏపీలో భారీ వర్షాల అలర్ట్.. పిడుగులు పడే అవకాశం!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు