HomeSportsIPL: టీమిండియా క్రికెటర్లకు మరో గుడ్ న్యూస్.. 

IPL: టీమిండియా క్రికెటర్లకు మరో గుడ్ న్యూస్.. 

IPL: టీమిండియా క్రికెటర్లకు మరో శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడే మన క్రికెటర్లకు బీసీసీఐ మంచి న్యూస్ అందించింది. ఐపీఎల్‌-2025 సీజ‌న్ నుంచి ప్ర‌తి ఆట‌గాడికీ మ్యాచ్ ఫీజు కింద రూ.7.50 ల‌క్ష‌లు అందించాలని భార‌త క్రికెట్ నియంత్రణ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్ర‌ట‌రీ జై షా ఎక్స్ వేదిక‌గా తెలిపారు.

“ఐపీఎల్ మ్యాచ్ ఫీజులు పెంచాల‌ని నిర్ణ‌యించాం. మా క్రికెట‌ర్లు ఇక‌పై ఒక్కో గేమ్‌కు రూ.7.5 లక్షల ఫీజు అందుకుంటారు. ఈ చారిత్రత్మ‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తున్నందుకు వెరీ హ్యాపీ.‘‘ అని జై షా పేర్కొన్నాడు.

ఓ క్రికెటర్ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడితే ఐపీఎల్ కాంట్రాక్ట్ లో దక్కే మొత్తంతో పాటు అడిషనల్ గా రూ.1.05 కోట్లు పొందే వీలుంది. ప్ర‌తి ఫ్రాంచైజీ సీజన్ మ్యాచ్ ఫీజుగా కూడా రూ.12.60 కోట్లు కేటాయిస్తుందన్నది తెలిసిందే. ఐపీఎల్​కు, ప్లేయర్లకు ఇది కొత్త శకమని జైషా తెలిపాడు. కాగా గతంలో ఒక్కో మ్యాచ్​కు ఫీజు రూ.2 లక్షలు – రూ.4 లక్షల వరకు ఇచ్చేవారు.

Read also: IPL Final 2023: తిరుగులేని మహేంద్రుడు.. ఐదో టైటిల్‌ విశేషాలు ఇవే..
IPL 2023: తిలక్ వర్మ మరో ఛాన్స్ కొట్టేశాడు.. చేతులు కలిపిన రిలయన్స్!
Duck out: క్రికెట్‌లో డకౌట్‌ అంటే ఏమిటి? ఈ పదం ఎలా వచ్చింది?
MS Dhoni Cutout: నందిగామలో 77 అడుగుల ధోని కటౌట్‌.. మహేంద్రుడి బర్త్‌డే స్పెషల్‌
T10 Cricket: టీ10 క్రికెట్‌లో సంచలనం.. స్కాట్లాండ్ బ్యాటర్ రికార్డు సెంచరీ 

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు