గురువారం, 17 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Chennai: కస్తూరీ.. ఏమిటీ వ్యాఖ్యలు? తెలుగు వారిపై నటి వివాదాస్పద కామెంట్స్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: సోమవారం, 4 నవంబర్ 2024

Chennai: తెలుగు వారిపై తమిళ నటీమణి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాలిటిక్స్ లో చేరిన ఆమె బీజేపీ నాయకురాలిగా ఉన్నారు. తాజాగా ఆ పార్టీ చెన్నైలో (Chennai) నిర్వహించిన సభలో మాట్లాడారు. దీనిపై తెలుగు నాట నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ కస్తూరి ఏమన్నారంటే..

‘‘రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారు. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ భారీ మాటలు మాట్లాడుతున్నారు’’ అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు కస్తూరి.

‘‘300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవలు చేసేందుకు వచ్చిన తెలుగు వాళ్లు.. ఇప్పుడు తమది తమిళ జాతి అంటున్నారు. మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు..?’’ అని పరోక్షంగా ద్రవిడ సిద్ధాంత వాదులకు ఆమె ప్రశ్నలు గుప్పించారు.

డీఎంకే సర్కారులో ఇప్పుడు మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడేవారు ఉన్నారని కస్తూరి తెలిపారు. ఇతరుల ఆస్తులు లూటీ చేయొద్దు, ఇతరుల భార్యలపై మోజుపడొద్దు.. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దు.. అని బ్రాహ్మణులు చెబుతున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారికి నిరసనగా తమిళనాట ప్రచారం జరుగుతోందన్నారు.

తాను నాలుగేళ్లుగా తెలుగు ప్రాంతమైన హైదారాబాద్ లో ఉంటున్నానన్న కస్తూరి, ఇక్కడున్న కొందరిని మీరందరూ ద్రవిడవాదులా అని అడిగితే.. అంటే ఏమిటంటూ తననను అడిగారని తెలిపారు. మీకన్నా ఎక్కువగా తెలుగు మాట్లాడేవారు తమిళనాడు రాష్ట్రంలో పదవుల్లో ఉన్నారని చెబితే, అవును కదా.. వారు కూడా రెడ్డిగారు కదా.. అంటూ తనకు సమాధానమిచ్చారన్నారు. అలా ఐదుగురు మంత్రులు తెలుగువారు డీఎంకే ప్రభుత్వంలో ఉన్నారంటూ కస్తూరి వ్యాఖ్యానించారు.

మీరు తెలుగు మాట్లాడుతున్నప్పుడు మేము తమిళులం కాదని, తమిళం మా జాతి అని చెప్పడానికి మీరు ఎవరంటూ డీఎంకేను నటి కస్తూరి ప్రశ్నించారు. హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరఫున చెన్నైలో బ్రాహ్మణులకు రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటి కస్తూరి మాట్లాడుతూ.. రాబోయే తరంలో ఎవరైనా చనిపోయినా కారుమతికి కూడా అయ్యర్లు ఉండరనే ఆందోళన వ్యక్తమవుతోందన్నారు.

ఈ ఆందోళన హిందూ సమాజానికి సంబంధించినదన్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి ప్రదేశంలో తప్పనిసరిగా ఉండాల్సిన వంశాన్ని ఎందుకు తొలగిస్తారని ప్రశ్నించారు. ద్రవిడ భాష మాట్లాడేవారి మొదటి సూత్రం దైవనిరాకరణ అన్నారు.బ్రాహ్మణ వ్యతిరేకత దాని వెనుక ఉన్న సూత్రం అన్నారు. ఎందుకంటే దేవుడు లేడని చెబితే నమ్ముతాడని, గుడిలో పూజావిధానాలు పాటిస్తే దేవుడున్నాడని ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. అప్పుడే హిందూ సమాజం ఏకమవుతుందన్నారు. నలుగురు కలసి ఉంటే హిందూ సమాజాన్ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు.

ప్రతి సమాజం విభజించబడాలని, తప్పుడు కథనాలు అల్లి ఆ కార్యకలాపాలు సాగిస్తున్నారన్నారు. శ్వేతజాతీయులు అబద్ధాలు చెప్పరని చెప్పే వారు తెల్లవారు కాదన్నారు. కస్తూరి హాట్ కామెంట్స్ ఇప్పుడు తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయ్యాయి.

ఇవీ చదవండి: Nargis Fakhri: నర్గీస్ ఫక్రీ ట్రెండీ లుక్స్.. రెడ్ డ్రెస్ హాట్ బ్యూటీ ఫొటో గ్యాలరీ
Jacqueliene Fernandez: ఐల్యాండ్‌ను కొన్న హాట్ బ్యూటీ.. ఫొటో గ్యాలరీ
Rakul preet: న్యూ లుక్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటో గ్యాలరీ
Zarashatavari: హీరోయిన్లూ అసూయ పడే అందం.. ఏఐ భామ హాట్ ఫొటోలు
Shriya Kontham: అందాలతో మతి పోగొడుతున్న బ్యూటీ.. శ్రియా కొణతం ఫొటోలు

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading