Kalki 2898AD: ప్రభాస్ అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్త. బాహుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన డార్లింగ్ ప్రభాస్.. కల్కి ద్వారా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో పేరు గాంచేందుకు రెడీ అయ్యాడు. Kalki 2898AD చిత్రం మే 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, నిన్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల తేదీని మే 13గా పేర్కొంది ఈసీ. ఈ నేపథ్యంలో మే 9న ప్రభాస్ కల్కి మూవీ రిలీజ్ అవుతుందా? లేదా అన్నది సందేహమేనంటున్నారు సినీ విశ్లేషకులు, అభిమానులు.
నాగ్ అశ్విన్, ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజన నటులు ఈ చిత్రంలో నటించారు. ఫేజ్ 4లో భాగంగా మే 13న ఓటింగ్ని షెడ్యూల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించింది. కల్కి 2898 AD మే 9న విడుదల కావాల్సి ఉన్నందున, సినిమా వాయిదా పడుతుందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు.
పోలింగ్ రోజు మే 13 అయితే Kalki2898AD పక్కా వాయిదా వేయండి అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు. #Kalki2898AD మే 9, 2024న షెడ్యూల్ చేశారు. మే 13న ఎన్నికల తేదీని నిర్ణయించినందున, రాజకీయ ప్రచారాల వేడి మే 11 వరకు కొనసాగుతుంది. ఇది ఏ చిత్రానికి పెద్దగా మైలేజీని అందించదని సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి. కల్కి చిత్రం వాయిదాపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన లేనప్పటికీ కొంతమంది అభిమానులు తమ నిరాశను చూపిస్తూ మీమ్స్ కూడా వేస్తున్నారు. మే 13 తర్వాత మంచి రోజు చూసుకొని కల్కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలని కోరుతున్నారు.
కల్కి 2898 AD చిత్రం ప్రభాస్, దీపిక, అమితాబ్, కమల్ ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రకు భైరవ అని పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. మహా శివరాత్రి సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్ను కూడా విడుదల చేశారు. సైన్స్ ఫిక్షన్ చిత్రం అయినప్పటికీ, కల్కి 2898 AD పురాణాలకు ఆశ్చర్యకరమైన సంబంధం ఉంది. ఒక ఈవెంట్లో సినిమా పేరు గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, “సినిమా మహాభారతంతో మొదలై 2898 ADలో ముగుస్తుంది. ఇది 6000 సంవత్సరాల కాలానికి విస్తరించింది. ప్రపంచాలను సృష్టించడానికి ప్రయత్నించాం. దానిని భారతీయంగా ఉంచుతూనే అవి ఎలా ఉంటాయో ఊహించుకుంటూ చిత్రాన్ని తీసినట్లు తెలిపారు.
ఎన్నికల అనంతరం విడుదల కానున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విశ్వక్ సేన్, నేహా షెట్టి నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం విడుదలకు నిర్మాతలు సమాయత్తమయ్యారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే మే 17 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఎక్స్లో చిత్ర నిర్మాతలు ప్రకటించారు. “గోదావరి ఒడ్డు నుంచి అత్యంత కఠినమైన మరియు హింసాత్మక కథను చూడటానికి సిద్ధంగా ఉండండి! మాస్ కా దాస్ @విష్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 17, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని పేర్కొన్నారు. ఈ వేసవిలో #GOGOnMay17th థియేటర్లలో మిమ్మల్ని కలుస్తున్నామంటూ చిత్ర నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ ఎక్స్లో పోస్టు చేశారు.
ఇవీ చదవండి:What Is Project K Movie : కల్కి 2898 AD.. ఈసారి హాలివుడ్ రేంజ్లో ప్రభాస్ దుమ్ము రేపుతాడా?
Project K: ప్రభాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ‘ప్రాజెక్ట్ కె’పై కీలక అప్డేట్.. టైటిల్ రివీల్ ఏ దేశంలో అంటే..!
Prabhas: మీకు తెలుసా..? ప్రభాస్ను ఓ హీరోయిన్ అన్నా అని పిలిచింది..!
