Ambati Rambabu: జరగబోయే ఎన్నికల్లో వైయస్ జగన్ను తట్టుకునే శక్తి తెలుగుదేశం పార్టీకి లేదని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్నికల సభల్లో దిగజారి మాట్లాడుతున్నారని, జనం రాక సందుల్లో సభలు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సత్తెనపల్లిలో ఇవాళ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరును ఎండగట్టారు. అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..
“చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. చంద్రబాబు పక్కన ఉన్న ముగ్గురు ఎవరు? ఎక్కడ పదవులు అనుభవించి ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారు? చంద్రబాబుకు సిగ్గు లేదు, శరం లేదు. లావు కృష్ణదేవరాయలు మా పార్టీ నుంచి వెళ్లి సైకిల్ ఎక్కాడు. వైఎస్సార్ టికెట్ ఇస్తే గెలిచిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి. చంద్రబాబు సభలు అన్ని అట్టర్ ప్లాప్. సందుల్లో పెట్టిన జనం రాలేదంటే మీ పరిస్థితి ఏంటో అర్ధమవుతుంది.
సీఎం జగన్ ను విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు. చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. మేం వదిలేసిన వ్యక్తులకు టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నావు. చంద్రబాబు పార్టీలో పోటీ చేసేందుకు నేతలే లేరు. తన పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తు లేవు. చంద్రబాబు, పవన్ లను నేను విమర్శించానే తప్ప తిట్టలేదు. సొంత పార్టీ నేతలే చంద్రబాబును తిట్టారు.
కన్నా తిట్టిన తిట్లు చంద్రబాబుకు గుర్తు లేదు. పొత్తు పెట్టుకోవడం సమాధి కట్టేయడమే చంద్రబాబు పని. ఇది కన్నా లక్ష్మీనారాయణ గతంలోనే చెప్పారు. విమర్శలు మరింత ఘాటుగా చేస్తా .. కానీ దిగజారి మాట్లాడను. వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీ తట్టుకునే పరిస్థితి లేదు. 175 స్థానాల్లో గెలిచి మళ్లీ వైఎస్ జగనే సీఎం అవుతారు. సర్వేలన్నీ ఇప్పటికీ వైఎసార్సీపీ విజయాన్ని తేల్చేశాయి.
ఓటమి ఖాయమవడంతో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. కుప్పంలో చంద్రబాబు కూడా గెలవడం కష్టం. పిఠాపురం లో పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతాడు. పవన్ కు రాజకీయాలు ఎందుకు ? రెండు రోజులు ప్రచారం చేసి 5 రోజులు పడుకుంటాడు. రాష్ట్రమంతటా పవన్ తిరిగే పరిస్థితి లేదు పవన్ కు రాజకీయాలు ఎందుకు ? డబ్బు కోసం కక్కుర్తి పడే అవసరం నాకు లేదు. చంద్రబాబు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నది ఎవరు ? చంద్రబాబు చేసిన తప్పిదంతోనే పోలవరం ఆలస్యమవుతోంది. సంక్రాంతికి డాన్సులు చేస్తే తప్పేంటి ? పండగకు కుటుంబసభ్యులతో డాన్స్ చేస్తే తప్పా ? చంద్రబాబులా నేను పొలిటికల్ డ్యాన్సర్ ను కాదు. రోజుకో పార్టీతో డాన్స్ చేసే వ్యక్తి చంద్రబాబు.” అని మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ చేశారు.
ఇవీ చదవండి: Ambati Rambabu on Sagar Issue: తెలుగు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించవద్దు : మంత్రి అంబటి
Perni Nani: చంద్రబాబు ఏనాడూ సచివాలయం గుమ్మం తొక్కలేదు: పేర్ని నాని
Vasireddy Padma: వైయస్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు: వాసిరెడ్డి పద్మ
