Andhra Pradesh : ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైన వార్తా సంస్థ రాయిటర్స్ డిసెంబర్ 2025లో ఒక ఆసక్తికరమైన విశ్లేషణాత్మక కథనం విడుదల చేసింది. ఇందులో 2029 ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ రాజకీయాల నుంచి వైదొలగితే, భారత ప్రధాని స్థానానికి సంభావ్య అభ్యర్థుల గురించి చర్చించింది. ఈ కథనంలో అత్యంత ఆశ్చర్యకరమైన పేరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇంకా ఆయన కుమారుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్లను ప్రస్తావించడం చర్చనీయాంశమైంది.
రాయిటర్స్ విశ్లేషణ ప్రకారం:
* 2026 నాటికి మోదీ మూడోసారి ప్రధానిగా మధ్య దశలో ఉంటారు.
* నాలుగోసారి అవకాశం తక్కువగా ఉందని, ఎన్డీయేలో ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారితే బలమైన రీజనల్ నాయకులకు అవకాశం ఉంటుందని చెప్పింది.
* బీజేపీలో అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్లను ప్రధాన అభ్యర్థులుగా పేర్కొన్నప్పటికీ, దక్షిణాది నుంచి చంద్రబాబు లేదా లోకేష్ కూడా పరిగణనలోకి రావచ్చని పేర్కొంది.
ఈ కథనం పబ్లిష్ అయిన వెంటనే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా YSRCP మద్దతుదారులు, సోషల్ మీడియా యూజర్లు దీన్ని భారీగా ట్రోల్ చేశారు. “లోకేష్ దేశ ప్రధాని అవుతాడా?”, “రాయిటర్స్ కూడా టీడీపీ పబ్లిసిటీకి దిగేసిందా?”, “ఇంకా ఏముంది.. లోకేష్ యూఎన్ సెక్రటరీ జనరల్ అవుతాడంటారేమో” అంటూ మీమ్స్, వీడియోలు, సెటైర్లు భారీ స్థాయిలో కనిపించాయి.
ఇక టీడీపీ వర్గాల్లో ఈ విశ్లేషణను కొందరు సానుకూలంగా తీసుకున్నప్పటికీ, చాలామంది దీన్ని “అతిశయోక్తి” లేదా “స్పెక్యులేషన్”గా భావించారు. లోకేష్ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చి మంచి పని చేస్తున్నారని, కానీ దేశ ప్రధాని స్థాయికి ఎదగాలంటే దానికి చాలా సమయం ఉందంటున్నారు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్
ఒకరు: “మోదీ తర్వాత లోకేష్ అంటే.. మళ్లీ యూత్ గళం పాదయాత్ర చేయాలా?”
మరొకరు: “రాయిటర్స్ రిపోర్ట్ చదివి లోకేష్ ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు.. YSRCP ఫ్యాన్స్ మాత్రం నవ్వు ఆపుకోలేకపోతున్నారు “
మొత్తంగా ఈ రాయిటర్స్ కథనం రాజకీయ విశ్లేషణ కంటే ట్రోలింగ్ మెటీరియల్గా ఎక్కువ హిట్ అయింది. ఇది రాజకీయాల్లో స్పెక్యులేషన్ ఎంత త్వరగా మీమ్స్గా మారుతుందో మళ్లీ నిరూపించింది!
ఇవీ చదవండి: AP DSC : నవంబర్లో టెట్.. జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ : లోకేష్ కీలక ప్రకటన
Lokesh with Modi : ప్రధానితో లోకేష్ భేటీ.. కీలక బాధ్యతలు, అరెస్టుల గురించేనా?
