HomeAndhra PradeshCongress: బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తానని మోసం చేశారు

Congress: బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తానని మోసం చేశారు

Congress: బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తానని చంద్రబాబు మోసం చేశారని పీసీసీ (Congress) చీఫ్ షర్మిల పేర్కొన్నారు. ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా శొంఠి నాగరాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి షర్మిల హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలోనూ కుల గణన జరగాలని, ఈ మేరకు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.

‘‘మన మోడీ ఒక బీసీ. బీసీ బిడ్డ ప్రధాని అవ్వడం మనకు గర్వకారణమే. ఆయన బీసీ అయ్యి ఉండి..ఆయన మాత్రమే గర్వంగా ఉన్నాడు. బీసీలు మాత్రం గర్వంగా లేరు. “బీసీ ప్రధాని ఫాయిదా కుచ్ నహీ”. 2017 లో బీసీల కులగణన చేస్తాం అని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. మళ్ళీ అధికారంలో వచ్చి మాట మార్చారు. కుల గణన కు బీజేపీ వ్యతిరేకం అన్నారు. బీజేపీ కి బీసీ ల పట్ల ప్రేమ లేదు.

బీసీలు అంటే అట్టడుగున ఉన్న పేదవాళ్ళు. బీజేపీ అగ్రకుల పార్టీ. అదానీ,అంబానీ లకు, కార్పొరేట్ వాళ్లకు కొమ్ముగాసే పార్టీ. బీసీలు అంటే మోడీకి ఓట్లు వేసే యంత్రాలు. రాష్ట్రంలో కూడా చంద్రబాబు కి ప్రేమ లేదు. బీసీల గురించి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు వైఎస్ఆర్. వైఎస్ఆర్ హయాంలో బీసీ జాబితా 143 కి పెంచారు. బీసీలు అందరు బాగుపడాలని కోరుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టీ బీసీ బిడ్డలను అగ్రస్థానం లో నిలబెట్టారు.

స్కాలర్ షిప్ లు వైఎస్ఆర్ ఇచ్చారు. బీసీలు వైఎస్ఆర్ ను ఓన్ చేసుకున్నారు. ఆ రోజుల్లో నాకు గుర్తు ఉంది. బీసీ సంఘ నాయకుడు ఆర్ కృష్ణయ్య అల్టిమేటం ఇచ్చారు. బీసీల హక్కుల కోసం ఆమరణ దీక్షకు పిలుపు నిచ్చాడు. బీసీల మీద గౌరవం తో ఆర్. కృష్ణయ్య ఒక్క నిమిషం కూడా దీక్ష చేయించలేదు. దీక్ష చేస్తే బీసీలను అగౌరవ పరిచి నట్లు అనుకున్నాడు. కృష్ణయ్య పెట్టిన 17 డిమాండ్ లు ఒప్పుకున్నాడు. అసెంబ్లీ లో రిజర్వేషన్లు 50 శాతం పెంచాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.

వైఎస్ఆర్ బీసీల మనిషి అయితే .. చంద్రబాబు బీసీల ద్రోహి. 10 సూత్రాలతో బీసీల మాస్టర్ ప్లాన్ అన్నాడు. టీడీపీ బీసీ ల పార్టీ అన్నాడు. 40 ఏళ్ల నుంచి టీడీపీ నీ మోసేది టీడీపీ అన్నాడు. బీసీలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తాం అన్నాడు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అన్నాడు…మోసం చేశాడు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తా అన్నాడు. పరిశ్రమలకు ప్రోత్సాహం అన్నాడు. బీసీల అభివృద్ధి కి ఒక్క రూపాయి ఇవ్వలేదు.

ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ సూపర్ మోసం చేస్తున్నారు. వచ్చిన 5 ఏళ్లలో విద్యుత్ బిల్లులను 17 వేల కోట్లు జనాలపై మోపారు. ఇప్పటికే ఇల్లు గడవని స్థాయిలో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు 40 శాతం అదనంగా పడుతున్న బిల్లులు భారమే కదా. బీజేపీ సైతం రాష్ట్రానికి ఇచ్చేది గుండు సున్నా. ఇచ్చిన హామీలు అన్ని పక్కన పెట్టారు. హోదా లేదు… నిధులు లేవు. కనీసం ప్రజల మీద విద్యుత్ చార్జీల భారం పడకుండా నిధులు కూడా ఇవ్వలేదు. అయినా చంద్రబాబు పొత్తు పెట్టు కోవడం దారుణం.

బీజేపీ కి గత 10 ఏళ్లుగా బాబు,జగన్ లు ఊడిగం చేస్తున్నారు. జగన్ సైతం బీసీలను మోసం చేశాడు. నా బీసీలు అని మోసం చేశాడు. ప్రతి ఏడాది 15 వేల కోట్లు ఇస్తా అన్నాడు. 5 ఏళ్లలో 75 వేల కోట్లు ఇస్తా అన్నాడు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 45 ఏళ్లు దాటిన బీసీ మహిళలకు 75 వేలు ఇస్తా అన్నాడు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కార్పొరేషన్ లు ఇచ్చాడు… ఇచ్చి రూపాయి కూడా ఇవ్వలేదు. (Congress)

బీసీల అభివృద్ధి కి కట్టుబడి ఉండేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కుల గణన అడుగుతుంది. బీసీలకు న్యాయం జరగాలి అంటే కుల గణన జరగాలి. ఎంత మంది బీసీలు ఉన్నారు తేలాలి. రిజర్వేషన్లు 50 శాతం కాదు .. ఎక్కువే కావాలి. కుల గణన చేస్తే న్యాయం జరుగుతుంది. కులాల వారిగా సంపదను పంచాలి. తెలంగాణ లో ఇప్పటికే కుల గణన జరుగుతుంది. ఆంధ్రలో కూడా కుల గణన జరిపించండి. చంద్రబాబు ను డిమాండ్ చేస్తున్నాం. బాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుల గణన కావాలని అడిగారు. జగన్ సైతం కుల గణన చేస్తా అన్నాడు. కుల గణన జరిగితేనే ఎవరు ఎంత మంది ఉన్నారో తెలుస్తుంది. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఆంధ్రలో కుల గణన జరపండి. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుంది. బీసీల పక్షాన నిలబడతాం. ఈ దేశంలో అత్యధికంగా ఉన్న వాళ్ళు బీసీలే.’’ అని షర్మిల అన్నారు.

ఇవీ చదవండి: Sharmila: సాయిరెడ్డికి షర్మిల కౌంటర్.. మీ బిడ్డలపై ప్రమాణం చేయగలరా?
YS Sharmila: షర్మిల కంట తడి.. అన్నపై హాట్ కామెంట్స్.. దౌర్భాగ్యుడు, శాడిస్ట్ అంటూ… పూర్తి ప్రసంగం ఇదీ
Sharmila: కరెంటు చార్జీల భారం ఉపసంహరించుకోవాలి
Sharmila on Jagan: షర్మిల కౌంటర్.. ఇది సామాన్యం కాదు జగన్ సార్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు