Jagananna Animutyalu: బ్రైట్ మైండ్స్, షైనింగ్ స్టార్స్.. ఆణిముత్యాలకు సీఎం జగన్‌ సత్కారం

Jagananna Animutyalu: పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు అత్యుత్తమ ప్రతిభ చూపిన ర్యాంకర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) సత్కారం చేశారు. జగనన్న ఆణిముత్యాలు (Jagananna Animutyalu) పేరిట కార్యక్రమాన్ని నిర్వహించిన ఏపీ సర్కార్‌.. (AP Govt) ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించింది. విజయవాడలోని ఏ-కన్వెన్షన్‌ సెంటర్‌ ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లను అభినందించారు. జగన్‌ కామెంట్స్‌ ఇవీ..

“ఈరోజు నా సమక్షంలో బ్రైట్ మైండ్స్, షైనింగ్ స్టార్స్, ది ఫ్యూచర్ ఆఫ్ ఏపీ, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్..మీకు, మీ తల్లిదండ్రులకు, గొప్పగా చదువులు చెప్పిన టీచర్లందరికీ గ్రాండ్ వెల్‌కమ్ తెలియజేస్తున్నా. ప్రతి మొఖంలో కాంతి కనిపిస్తోంది. ఆత్మ విశ్వాసం కనిపిస్తోంది. ఇది నిజంగా ఇవి నాకు చాలా నచ్చాయి. మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు.. ఈరోజు మహా వృక్షాలై, ప్రపంచానికే అభివృద్ధి ఫలాలు అందించాలని కోరుకుంటున్నా.- మిమ్మల్నందరినీ చూస్తుంటే గవర్నమెంట్ బడి, గవర్నమెంట్ కాలేజీలను మరింత గొప్పగా మార్చాలనే కోరిక మరింత పెరుగుతోంది. పేద పిల్లలు ఏ ఒక్కరూ కూడా పేదరికం వల్ల చదువులకు దూరం కాకూడదని మన ప్రభుత్వం గట్టిగా నిర్ణయించింది.

ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయి..

మీరు వెళ్లే గవర్నమెంట్‌ బడి నాడు-నేడు ద్వారా రూపురేఖలు మారుతున్నాయి. మిడ్డే మీల్ కూడా జగనన్న గోరుముద్దగా మార్పులతో అందిస్తున్నాం. బడులు తెరిచే టయ్యానికల్లా జగనన్న విద్యా కానుక అందిస్తున్నాం. గవర్నమెంట్ బడి నాలుగేళ్లలోనే ఇంగ్లిష్ కు మీడియం మారింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్ అందుబాటులోకి వచ్చింది. పాఠ్యపుస్తకాలన్నీ సిలబస్ మారాయి. బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్ తెచ్చాం. బైజూస్ కంటెంట్‌ గవర్నమెంట్ బడుల్లో అందుబాటులోకి తెచ్చాం. మనం చదువుకుంటున్న బడుల్లో సదుపాయాలు అన్నీ మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

గతంలో క్లాస్ టీచర్లే సరిగ్గా ఉంటారా ఉండరా అనే పరిస్థితుల నుంచి సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులో ఉంచే దిశగా అడుగులు పడుతున్నాయి. క్లాస్ లలో డిజిటల్ బోధన కోసం ఆరో తరగతి నుంచి ప్రతి పిల్లాడికీ ఐఎఫ్పీ ప్యానెల్స్ బిగించి డిజిటల్ బోధన. 8వ తరగతి పిల్లలకు కంటెంట్ లోడెడ్ ట్యాబ్‌లను ఇస్తూ ప్రోత్సహిస్తున్నాం. మన పేదింటి పిల్లలందరూ అంతర్జాతీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి మూడో తరగతి నుంచి టోఫెల్ ఎగ్జామ్ కు ప్రిపేర్ చేస్తున్నాం. అంతర్జాతీయ సర్టిఫికెట్ ఇచ్చే గొప్ప అడుగు పడుతోంది. పిల్లలు వినడం, మాట్లాడటం రెండింటిలో కూడా ఇంగ్లిష్ లో ఇక అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చే కార్యక్రమం మన గవర్నమెంట్ బడుల్లో జరుగుతోంది.

ఇవన్నీ మన గవర్నమెంట్‌ బడులే…

ఇలాంటి మార్పులు గవర్నమెంట్ బడుల్లో రాగలుగుతాయా? ఇది సాధ్యమయ్యే పనేనా అనే పరిస్థితి నుంచి.. ఇవన్నీ మన గవర్నమెంట్ బడులే.. ప్రైవేట్ బడులకు గవర్నమెంట్ బడులతో పోటీ పడక తప్పదు అనే పరిస్థితి తీసుకొచ్చాం. ప్రతి అక్కకూ, ఒక మంచి అన్నగా, తమ్ముడిగా వాళ్ల పిల్లలందరికీ మంచి చదువులు ఉండాలని మనసారా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీతో బయటకు రావాలి. ఈ క్రమంలో ఏ పిల్లాడు గానీ, తల్లిదండ్రులు గానీ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు. డిగ్రీ సర్టిఫికెట్ చేతిలో ఉండాలని అనే తాపత్రయంతో విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.

డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఇటువంటివన్నింటికీ మొత్తం ఫీజులన్నీ ప్రభుత్వమే భరిస్తోంది. విదేశాల్లో కూడా టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీల్లో 350 కాలేజీల్లో.. ప్రతి పిల్లాడికీ సీటు తెచ్చుకోండి.. మీకు మీ జగన్ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది. కోటీ 25 లక్సలు అయినా కూడా మీరు భయపడాల్సిన పని లేదు. రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎక్కడా జరగని విధంగా బడులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి అనే గొప్ప కార్యక్రమం తీసుకొచ్చాం. మన పిల్లలందరూ కూడా ప్రతి రంగంలోనూ ఎదగాలి. ఎదగడం కూడా కాదు.. ఎగరాలి.

ప్రపంచానికి లీడర్లుగా మన పిల్లలు ఉండాలి…

ప్రపంచంలో వస్తున్న ఇన్వెన్షన్స్, ఇన్నోవేషన్స్.. వీటిని అనుసరించేవారుగా మన వాళ్లు ఉండకూడదు.. వీటిలో ప్రతి రంగంలోనూ ప్రపంచానికి లీడర్లుగా మన పిల్లలు ఉండాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. ఇది జరగాలంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలి. అందుకే ఈ నాలుగు సంవత్సరాల్లో మన ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ దేశంలో ఎవరూ పెట్టి ఉండరు. రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ బడుల్లో ఐబీ సిలబస్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ పరీక్షల మాదిరిగానే మన పరీక్ష పత్రాలు కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.

గవర్నమెంట్ బడుల్లో చదువుకుంటున్న పేద వర్గాలు రేప్పొద్దున ప్రపంచాన్ని ఏలే పరిస్థితి కూడా త్వరలోనే వస్తుంది. మనం చూస్తాం. లీడర్ షిప్ క్వాలిటీస్ పెంచే విధంగా మన చదువులు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఇంజనీరింగ్, మెడిసిన్ లేదా ఏదో ఒక డిగ్రీ తెచ్చుకోవడమే కాకుండా చదువులు వేగంగా మారుతున్నాయి. ప్రపంచాన్ని శాసించబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్సెస్, మెషీన్ లెర్నింగ్, ఛాట్ జీపీటీ యుగంలో ఉన్న మన పిల్లలందరూ కూడా ఎంతగా ఎదగాలి అన్నది ఆలోచించాలి. ఆ స్థాయిలో ఎడ్యుకేషన్ రంగం మారబోతోంది. మార్పు చేస్తాం. ఈ మార్పును ప్రతి పేద వాడికి తీసుకురావాలి.

ర్యాంకులు రానివారు కూడా ఈక్వలీ ఇంపార్టెంట్…

టాప్ ర్యాంకులు తెచ్చుకున్నమీరే కాదు.. మీతోపాటు ఏ ర్యాంకూ తెచ్చుకోలేని వాళ్లు కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. సంకల్పం గట్టిదైతే రిజల్ట్ ఆటోమేటిగ్గా వస్తుందని గుర్తు పెట్టుకోవాలి. మాణిక్యాలన్నీ మట్టిలోనే తేలుతాయి. అరక దున్నినప్పుడు వజ్రాలు బయటికి వస్తాయని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మన గవర్నమెంట్ బడుల్లో కార్పొరేట్ కాలేజీలకు మించి సదుపాయాలు అందిస్తామని తెలియజేస్తున్నా. గవర్నమెంట్ బడికి జీవం పోస్తూ ఆణిముత్యాలను సత్కరించే కార్యక్రమం ప్రారంభిస్తున్నాం.

4 స్థాయిల్లో రాష్ట్రం మొత్తం మీద ఈ ఏడాది 22,768 మంది టెన్త్, ఇంటర్ పరీక్షల్లో టాప్ ర్యాంకుల్లో నిలిచిన పిల్లలను సత్కరించడం జరుగుతోంది. ఇది ప్రత్యక్షంగా పేద పిల్లలకు, వారి తల్లిదండ్రులు, పరోక్షంగా గవర్నమెంట్ బడికి, గవర్నమెంట్ బడుల్లో పాఠాలు చెబుతున్న ఆ టీచర్లకు ఇది సన్మానం. మరోసారి మీ అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ.. ఈరోజు మనం చేస్తున్న ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఇంకా గొప్ప మార్పులు చూపిస్తూ మంచి రిజల్ట్ తో ముందుకు రావాలని చెప్పి మనసారా కోరుకుంటూ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం.” అని సీఎం జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

Read Also : Mudragada on Pawan: కాపుల కొట్లాటగా మారిన పవన్‌ టూర్.. ముద్రగడ లేఖతో మరింత రంజుగా రాజకీయం!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles