Tiruvannamalai Temple: తమిళనాడులోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా కొత్త నిబంధనను తెలుసుకోవాలి. 2026 సెప్టెంబర్ 1 నుంచి ఆలయం లోపలికి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై పూర్తిస్థాయిలో నిషేధం అమల్లోకి రానుంది. తమిళనాడు హిందూ మత, ధార్మిక దానాల శాఖ (HR&CE) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయ పవిత్రతను కాపాడటం, దర్శన సమయంలో సెల్ఫీలు, ఫొటోలు, వీడియోలు, సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరణను నియంత్రించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా అధికారులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 1 నుంచి తిరువణ్ణామలైకి వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులు కూడా ఈ నిబంధనను దృష్టిలో పెట్టుకోవడం మంచిది.
