Vijayawada Terror Links: విజయవాడ నగరంలోని రద్దీ ప్రాంతమైన వించిపేటలో కౌంటర్ ఇంటెలిజెన్స్ (CI) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించడంతో నగరంలో ఉగ్ర భయం నెలకొంది.
12 మంది సభ్యులతో గ్యాంగ్ ఏర్పాటు
సొహైల్ బేగ్, షరీఫ్, డానిష్ నేతృత్వంలో Al Malik Islamic Youth పేరిట 12 మంది సభ్యులతో ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
సోషల్ మీడియాలో ఉగ్ర ప్రచారం
నిందితులు సోషల్ మీడియాలో IQIS, ISIS పేర్లతో రెండు గ్రూపులు నడుపుతూ తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తూ యువతను ఆకర్షించడానికి ప్రయత్నించినట్లు విచారణలో తేలింది.
వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాల ప్లాన్
వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, కర్నాటక, బిహార్, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కార్యకలాపాలకు ఈ గ్యాంగ్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మరింత మందిపై పోలీసులు గాలింపు
ముగ్గురు విజయవాడకు చెందిన వారు, ఒకరు హైదరాబాద్కు చెందిన నిందితులను అరెస్ట్ చేశారు. బిహార్కు చెందిన దిల్కాష్ సహా మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు స్వాధీనం చేసుకుని విచారణ కొనసాగుతోంది.
ఇవీ చదవండి: Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రవాద దాడి.. జమ్మూ కశ్మీర్లో రక్తపాతం
Mediterranean food: మధ్యస్త ఆహారం.. ఏం తినాలి? ఎలా ప్రారంభించాలి?
IPL 2026: ఐపీఎల్ పోరుకు రెడీ.. వరల్డ్ కప్ హీరోలు తమ పాత జట్లలోనే
