HomeAndhra PradeshAP Cabinet Expansion: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. కూటమి కేబినెట్ భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమా?

AP Cabinet Expansion: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. కూటమి కేబినెట్ భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమా?

AP Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెద్ద చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి భారీ కేబినెట్ ప్రక్షాళన జరగబోతుందనే గాసిప్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికార వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ప్రస్తుత మంత్రివర్గంలో పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదనే సంకేతాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఈసారి కేవలం చిన్న మార్పులు కాకుండా, మొత్తం మంత్రివర్గ రూపురేఖలు మారేలా భారీ రీషఫుల్ జరగవచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

లోకేష్ టీమ్‌కే అధిక ప్రాధాన్యం?
రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చ‌ర్చ ప్ర‌కారం, కొత్త కేబినెట్‌లో నారా లోకేష్‌కు దగ్గరగా ఉన్న నేతలకు ఎక్కువ ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. యువ నాయకత్వానికి అవకాశాలు ఇవ్వాలని పార్టీ లోపలే ఒక అభిప్రాయం పెరుగుతోందని సమాచారం. అందుకే ఈసారి మంత్రివర్గంలోకి వచ్చే వారిలో చాలా మంది లోకేష్‌కు సన్నిహితులే ఉంటారని రాజకీయ వర్గాల భోగ‌ట్టా.

కొత్త కేబినెట్‌లోకి వచ్చే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు?
రాజకీయ గుసగుసల ప్రకారం, కొత్త మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం ఉన్న పేర్లు కొన్ని ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. అవి.. పల్లా శ్రీనివాసరావు – గాజువాక, బెందాళం అశోక్ – ఇచ్చాపురం, మద్దిపాటి వెంకటరాజు – గోపాలపురం, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి – కోవూరు, కొణతాల రామకృష్ణ – అనకాపల్లి.. వీరిలో కొందరు గతంలోనే కీలక బాధ్యతలు నిర్వహించినవారే కావడం గమనార్హం. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం పెరిగేలా ఈసారి కేబినెట్‌లో మార్పులు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పల్లా శ్రీనివాసరావుకు కీలక శాఖ?
ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావుకు ఈసారి కీలకమైన రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీకి కష్టకాలంలో పనిచేసిన నాయకుడిగా ఆయనకు మంచి ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే పల్లా మంత్రివర్గంలోకి వెళితే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవిలో మార్పు అనివార్యం అవుతుంది.

కొత్త టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు?
పల్లా శ్రీనివాసరావు మంత్రి అయితే, ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశంపై కూడా పార్టీ లోపల చర్చ జరుగుతోందట. ఈ జాబితాలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్. ఇద్దరూ పార్టీకి విశ్వసనీయ నేతలుగా ఉండటంతో, వారిలో ఒకరికి పార్టీ బాధ్యతలు ఇవ్వవచ్చని సమాచారం.

ఉగాదికి కాకపోయినా మార్పులు ఖాయం?
మొదట్లో ఈ మార్పులు ఉగాది సందర్భంగా ప్రకటించవచ్చని ప్రచారం జరిగినా, ఇప్పుడు మాత్రం కొంత ఆలస్యమైనా భారీ మార్పులతోనే కేబినెట్ రీషఫుల్ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇది కేవలం మంత్రుల మార్పు మాత్రమే కాకుండా, రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగా కూడా ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అసలు లక్ష్యం ఏమిటి?
ఈ కేబినెట్ ప్రక్షాళన వెనుక ప్రధానంగా మూడు లక్ష్యాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాంతీయ సమతుల్యత, యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాల‌ని భావిస్తున్నారు.

పార్టీ బలోపేతం
ఈ మూడు అంశాల ఆధారంగా కొత్త మంత్రివర్గాన్ని రూపొందించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ఇవన్నీ ప్రస్తుతం రాజకీయ గాసిప్‌లుగానే చెబుతున్నారు. కానీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలు చూస్తే, త్వరలోనే ఏపీ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తోంది.

ఇవీ చ‌ద‌వండి: Rice Card Andhra Pradesh: ఏపీలో రేషన్ కార్డుదారులకు షాక్.. ఆ ఛార్జీలు భారీగా పెంపు?
Andhra Pradesh: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వ భరోసా
Andhra Pradesh: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిపై ఏపీ ప్రభుత్వ ప్రత్యేక దృష్టి – మంత్రి కొండపల్లి శ్రీనివాస్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు