Team India : ఆసియా కప్లో పాకిస్థాన్తో కీలక పోరుకు ముందు టీమిండియా కొత్త ఫీల్డింగ్ టాక్టిక్స్ను పరీక్షించింది. ఇప్పటికే బ్రాంకో టెస్ట్ను ఆటగాళ్లకు పరిచయం చేసిన బీసీసీఐ, ఇప్పుడు ఫీల్డింగ్లోనూ కొత్త డ్రిల్ను ప్రవేశపెట్టింది. ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ పర్యవేక్షణలో ఈ ప్రత్యేక డ్రిల్ నిర్వహించబడింది. ప్రధాన ఉద్దేశం — ఫీల్డింగ్ మెరుగుపరచి, పరుగులను అడ్డుకోవడం ద్వారా జట్టుకు అదనపు బలం చేకూర్చడం. Team India
డ్రిల్ ఎలా జరిగింది?
ప్రతి ఆటగాడు వేగంగా కదులుతూ, కేటాయించిన టాస్క్లను పూర్తి చేయాలి. రెండు సెట్లలో ఐదేసి క్యాచ్లు అందుకోవాల్సి ఉంటుంది. మధ్యలో గార్డ్స్ను మార్చుకుంటూ ముందుకు సాగడం కూడా ఈ డ్రిల్లో భాగం.
హార్దిక్ పాండ్యా తొలి ప్రయత్నంలో బంతిని మిస్ చేసినా, తర్వాత అద్భుతమైన క్యాచ్తో మెప్పించాడు.
శివమ్ దూబే తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
శుభ్మన్ గిల్ అత్యంత క్లిష్టమైన నాలుగు క్యాచ్లను అందుకుని కోచ్ ప్రశంసలు అందుకున్నాడు.
రింకు సింగ్ మొదటి సెట్లో కాస్త ఇబ్బంది పడ్డా, రెండో సెట్లో అద్భుత ప్రదర్శన చేసి టాప్లో నిలిచాడు. చివరికి విజేతగా నిలిచిన రింకుకు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ మెడల్ను అందజేశారు.
ఈ కొత్త డ్రిల్ పాక్ మ్యాచ్ ముందస్తు సన్నాహాల్లో ఆటగాళ్లలో చురుకుదనం పెంచడమే కాకుండా, ఫీల్డింగ్ లోపాలను తగ్గించడంలోనూ సహాయపడిందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి: Team India: ఇక ఆ ఆటలు ఆడలేరు.. బీసీసీఐ నియమాలు ఏంటో తెలుసా?
Team India: ఆసియా కప్ ముంగిట గాయపడిన స్టార్ ప్లేయర్!
