HomeAndhra PradeshYSR Birthday: జన హృదయ విజేత.. సంక్షేమం ప్రధాత.. అపర భగీరధుడు.. YSR జయంతి సందర్భంగా...

YSR Birthday: జన హృదయ విజేత.. సంక్షేమం ప్రధాత.. అపర భగీరధుడు.. YSR జయంతి సందర్భంగా వైఎంవీఎస్ నాగిరెడ్డి నివాళి

YSR Birthday: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ యం.వి.ఎస్. నాగిరెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజల హృదయాలను గెలుచుకున్న నాయకుడిగా, సంక్షేమ పాలనకు చిరునామాగా, అపర భగీరథుడిగా వైఎస్సార్‌ను కొనియాడారు.

ఈ సందర్భంగా వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నాగిరెడ్డి గుర్తు చేశారు.

రైతు సంక్షేమానికి వైఎస్సార్ పెద్దపీట
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో వైఎస్సార్ ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు తీసుకుందని నాగిరెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల రద్దు, పావలా వడ్డీకే పంట రుణాలు అందించడం ద్వారా వ్యవసాయ రంగానికి ఊతమిచ్చారని తెలిపారు.

అలాగే కేంద్ర రుణమాఫీ పరిధిలోకి రాని సుమారు 36 లక్షల మంది రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.1,800 కోట్ల సాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, ఇన్‌పుట్ ధరలను నియంత్రించడం ద్వారా రైతుల ఆదాయం పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందన్నారు.

జలయజ్ఞంతో సాగునీటి విస్తరణ
రాష్ట్రంలో సాగునీటి వసతులను పెంచే లక్ష్యంతో జలయజ్ఞం పేరుతో అనేక భారీ నీటిపారుదల ప్రాజెక్టులను ప్రారంభించారని నాగిరెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు వైఎస్సార్ ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందన్నారు.

ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు
పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఖరీదైన వైద్య చికిత్సలను ఉచితంగా అందించే అవకాశాన్ని ఈ పథకం కల్పించిందన్నారు.

అత్యవసర వైద్య సేవల కోసం 108 అంబులెన్స్ సేవలు, గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేసేందుకు 104 ఆరోగ్య సేవలు ప్రారంభించడం ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని చెప్పారు.

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వైఎస్సార్ ప్రభుత్వం అమలు చేసిందని నాగిరెడ్డి తెలిపారు. దీని ద్వారా వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పొందారని పేర్కొన్నారు.

పేదలకు ఇళ్లు.. మహిళలకు ఆర్థిక బలం
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లక్షలాది మంది పేద కుటుంబాలకు సొంత గృహాలు నిర్మించి అందించారని చెప్పారు. మహిళల స్వయం సహాయక సంఘాలకు రుణాలు, వడ్డీ రాయితీలు అందించి వారి ఆర్థిక సాధికారతకు బాటలు వేసిన నాయకుడిగా వైఎస్సార్ నిలిచారని వివరించారు.

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు
గ్రామీణాభివృద్ధి, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో వైఎస్సార్ చేపట్టిన కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చాయని నాగిరెడ్డి అన్నారు.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలనే భావనతో పాలన సాగించిన వైఎస్సార్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ భరోసానిచ్చిన గొప్ప ప్రజానాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు.

రైతు దినోత్సవ శుభాకాంక్షలు
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఆశయాలు చిరస్థాయిగా నిలవాలని ఆకాంక్షిస్తూ, ఆయన 77వ జయంతి సందర్భంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రైతులకు నాగిరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఇవీ చ‌ద‌వండి: YS Jagan on YSR Padayatra: నాన్న పాద‌యాత్ర‌ను గుర్తు చేసుకుంటూ నా ప్ర‌యాణం.. వైఎస్ జ‌గ‌న్ ఎమోష‌న‌ల్ ట్వీట్
YSRCP Formation Day: విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్సార్‌సీసీ: పార్టీ ఆవిర్భావ వేడుక‌ల్లో వైఎస్ జ‌గ‌న్
YSRCP Meeting : విద్య, వైద్యం, వ్యవసాయం.. అన్నింటా రాష్ట్రం తిరోగమనం: జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు