Hormuz Strait Tension: అమెరికా-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ కీలక నిర్ణయం తీసుకోబోతుందన్న వార్తలు గ్లోబల్గా చర్చనీయాంశమయ్యాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై భారీ సుంకం విధించే ఆలోచనలో ఇరాన్ ఉందని నిఘా నివేదికలు సూచిస్తున్నాయి.
1. ఒక్క నౌకకు $2 మిలియన్ సుంకం
ఇరాన్ హోర్ముజ్ గుండా వెళ్లే ప్రతి నౌక నుంచి సుమారు $2 మిలియన్ (రూ.20 కోట్ల వరకు) వసూలు చేయాలని భావిస్తోంది.
ఇది అమల్లోకి వస్తే, చరిత్రలో ఇదే మొదటి సారి.
2. ‘సేఫ్ కారిడార్’ పేరుతో కొత్త విధానం
ఇరాన్ హోర్ముజ్ సమీపంలో ఒక సురక్షిత మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఈ మార్గం ద్వారా వెళ్లే నౌకలపై ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
3. భారతదేశం సహా పలు దేశాల నౌకలు ప్రభావం
ఈ ప్రాంతం గుండా ప్రయాణించే నౌకల్లో భారత్, చైనా, పాకిస్తాన్, మలేషియా దేశాలకు చెందినవీ ఉన్నాయి. అందువల్ల ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
4. యుద్ధం, ఆంక్షలకు ప్రతిస్పందన
ఇరాన్పై విధించిన ఆంక్షలకు ప్రతిగా ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. “మా ప్రాంతాల్లో పన్నులు విధించే హక్కు మాకు ఉంది” అని ఇరాన్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
5. గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం
హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలకం. ఇక్కడ ఉద్రిక్తతలు పెరిగితే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఈ పరిణామాలు గ్లోబల్ ట్రేడ్, ఇంధన మార్కెట్లపై పెద్ద ప్రభావం చూపే అవకాశముంది. హోర్ముజ్ ప్రాంతంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి: Mega Star Chiranjeevi: ఉగాది రోజున కీలక నిర్ణయం తీసుకున్న మెగాస్టార్.. ఉచిత విద్య దిశగా మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం
Iran USA Israel: ఆచూకీ చెబితే ఎన్నికోట్లంటే.. మరింత ముదిరిన ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు
Iran news: విదేశాల్లో ఉన్న పౌరులకు ఇరాన్ హెచ్చరిక.. శత్రుదేశాలకు సహకరిస్తే ఆస్తుల జప్తు
