PV Sindhu: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి ప్రపంచానికి తన సత్తా చాటారు. గాయాలు, వరుస వైఫల్యాలు, ఫామ్ కోల్పోవడం వంటి సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత జపాన్ ఓపెన్-2026 టైటిల్ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ను గెలిచిన తొలి భారతీయ మహిళా షట్లర్గా రికార్డు నెలకొల్పారు. అయితే ఈ విజయం వెనుక కేవలం కఠిన సాధన మాత్రమే కాదు.. ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిన విరాట్ కోహ్లీ సలహా, అలాగే భర్త వెంకట దత్త సాయి అందించిన అండ కీలక పాత్ర పోషించాయి.
‘ఫలితాల గురించి మర్చిపో.. ఆటను ఆస్వాదించు’.. కోహ్లీ ఇచ్చిన సలహా
ఫామ్ లేక తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో సింధు, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని కలిసి తన పరిస్థితిని వివరించారు. సెంచరీల కరువు సమయంలో తాను మానసికంగా ఎలా నిలబడ్డానో వివరిస్తూ కోహ్లీ ఇచ్చిన సలహా సింధు జీవితాన్ని మలుపు తిప్పింది. “ఫలితాల కోసం ఆడొద్దు.. ఆటలోని ఆనందాన్ని మళ్లీ ఆస్వాదించు. ప్రతి మ్యాచ్ను ఒత్తిడిగా కాకుండా అవకాశంగా చూడి” అనే కోహ్లీ మాటలు సింధుకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత గెలుపు గురించి కాకుండా, ఆటపై ప్రేమను తిరిగి పొందడంపైనే ఆమె దృష్టి పెట్టారు.
గాయం నుంచి కోలుకోవడంలో భర్త కీలక పాత్ర
కాలు వేలి లిగమెంట్ గాయం కారణంగా మూడు నెలల పాటు కోర్టుకు దూరమైన సింధుకు ఆ సమయంలో భర్త వెంకట దత్త సాయి అండగా నిలిచారు. మానసికంగా, శారీరకంగా పూర్తిగా కోలుకునేందుకు ఆమెను అమెరికాలోని అట్లాంటా ఎక్సోస్ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ సెంటర్కు తీసుకెళ్లారు. అక్కడ నిపుణుల పర్యవేక్షణలో ఫిట్నెస్, రికవరీతో పాటు మానసిక దృఢత్వంపై ప్రత్యేక శిక్షణ పొందారు. స్టార్ ప్లేయర్ అనే హోదాను పక్కన పెట్టి సాధారణ అథ్లెట్లా శిక్షణ తీసుకోవడం ఆమెకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
స్పోర్ట్స్ సైన్స్, డైట్తో మారిన సింధు ఆట
పారిస్ ఒలింపిక్స్ తర్వాత సింధు ప్రదర్శనపై కోచింగ్ బృందం, స్పోర్ట్స్ సైన్స్ నిపుణులు సమగ్ర విశ్లేషణ చేపట్టారు. మ్యాచ్లలో దూకుడు తగ్గడం, లైన్ జడ్జిమెంట్లో తప్పిదాలు పెరగడం ప్రధాన బలహీనతలుగా గుర్తించారు. దీంతో ప్రత్యేక శిక్షణ ప్రణాళిక రూపొందించి, ఆమె ఆటతీరులో మార్పులు తీసుకొచ్చారు. టోర్నమెంట్కు ముందు ప్రత్యేక డైట్ పాటించి 3.5 కిలోల బరువు తగ్గిన సింధు, ఫిట్నెస్తో పాటు వేగాన్ని కూడా పెంచుకున్నారు. ఈ మార్పులే కోర్టులో ఆమె ఆటలో స్పష్టంగా కనిపించాయి.
కన్నీళ్లు తెప్పించిన విజయం.. కొత్త స్ఫూర్తిగా సింధు
జపాన్ ఓపెన్ ఫైనల్లో జపాన్ స్టార్ అకానె యమగూచిపై విజయం సాధించిన వెంటనే సింధు, ఆమె కోచింగ్ బృందం భావోద్వేగానికి గురయ్యారు. రెండేళ్లుగా ఎదుర్కొన్న కష్టాలు ఒక్క విజయంతో ఫలించిన ఆనందంలో అందరి కళ్లలో ఆనందబాష్పాలు కనిపించాయి. ఈ టైటిల్ కేవలం మరో ట్రోఫీ మాత్రమే కాదు.. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం ఉంటే ఎంతటి కష్టకాలాన్నైనా అధిగమించవచ్చని నిరూపించిన విజయగాథగా నిలిచింది. పీవీ సింధు కమ్బ్యాక్ ఇప్పుడు భారత క్రీడా ప్రపంచానికి కొత్త స్ఫూర్తిగా మారింది.
ఇవీ చదవండి: Virat Kohli Record: యాక్టివ్ క్రికెటర్లలో 85 సెంచరీలతో కింగ్ కోహ్లీ టాప్
Virat Kohli: కోహ్లీ ఫాంలోకి రావాలంటే ఇంకా అలా చేయాల్సిందే.. సీనియర్ క్రికెటర్ల కీలక సూచనలు
Virat Kohli: IPLలో మరో భారీ రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ.. 9000 పరుగుల మైలురాయికి కేవలం 92 పరుగుల దూరం
