Chandrababu at Delhi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి Amit Shah సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధత కల్పించడంతో పాటు, వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు విడుదల చేయాలని విజ్ఞాపన పత్రాలను అందజేశారు.
అమరావతికి చట్టబద్ధత – రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం
అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పించాల్సిందిగా అమిత్ షాను సీఎం కోరారు. అదే విధంగా, కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharamanతో సమావేశంలో పూర్వోదయ పథకం కింద రాయలసీమను ఉద్యాన హబ్గా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద పెండింగ్లో ఉన్న కేంద్ర వాటాను వెంటనే విడుదల చేయాలని కోరారు.
వ్యవసాయ రంగానికి పెద్ద ఊతం
కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీలో ఏపీలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం అభ్యర్థించారు. కొల్లేరు ప్రాంతంలో సుమారు 50 వేల ఎకరాల్లో మఖానా సాగుకు అనుకూలత ఉందని తెలిపారు.
పీఎం ప్రణామ్ పథకం కింద సామూహిక సహజ వ్యవసాయాన్ని విస్తరించేందుకు నిధులు, గతేడాది రసాయన ఎరువుల వినియోగం తగ్గించినందుకు రూ.216 కోట్ల ప్రోత్సాహకాలు మంజూరు చేయాలని కోరారు.
కొబ్బరి సాగు, కోకోనట్ ప్రాసెసింగ్ పార్కు, ఆధునిక టెండర్ కోకోనట్ మార్కెట్ల ఏర్పాటు, రైతులకు శిక్షణకు రూ.200 కోట్ల సాయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వన్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద పెండింగ్లో ఉన్న రూ.695 కోట్ల విడుదలకు కూడా అభ్యర్థన చేశారు.
పోలవరం రెండో దశకు రూ.32 వేల కోట్లు అవసరం
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశంలో పోలవరం ప్రాజెక్టు రెండో దశ భూసేకరణ, పునరావాసానికి రూ.32 వేల కోట్ల అవసరం ఉందని సీఎం వివరించారు. స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేయాలని, కుడి–ఎడమ కాలువల సామర్థ్య పెంపు వల్ల పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్ చేయాలని కోరారు. పోలవరం–నల్లమల సాగర్ లింక్ ప్రతిపాదనలకు ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
సరుకు రవాణాకు ప్రత్యేక ఫ్రైట్ కారిడార్లు
కేంద్ర రైల్వే మంత్రి Ashwini Vaishnawతో సమావేశంలో ఉత్తర–దక్షిణ భారత్ను కలుపుతూ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు నిర్మించాలని సీఎం ప్రతిపాదించారు. ఇటార్సీ–విజయవాడ ఫ్రైట్ కారిడార్, ఖరగ్పూర్–చెన్నై ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్కు సహకారం కోరారు.
రాయలసీమ నుంచి జేఎన్పీటీ పోర్టుకు అరటి ఎగుమతుల కోసం 50 శాతం రాయితీపై ఖాళీ రీఫర్ కంటైనర్లు కేటాయించాలని అభ్యర్థించారు. అలాగే విజయవాడ, విశాఖ, తిరుపతి, అమరావతిల్లో గ్రీన్ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినల్స్, కొత్త రైల్వే లైన్లు, హైస్పీడ్ మరియు సెమీ హైస్పీడ్ కారిడార్లకు ఆమోదం ఇవ్వాలని కోరారు.
జీరో ల్యాండ్ఫిల్ రాష్ట్రంగా ఏపీ
స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0 కింద ఏపీని జీరో ల్యాండ్ఫిల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రూ.276 కోట్ల ప్రణాళిక రూపొందించామని, కేంద్ర వాటాగా రూ.105 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను సీఎం కోరారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్ర మద్దతుకు కృతజ్ఞతలు
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామితో భేటీలో విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినందుకు కేంద్రానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర సాయం, రాష్ట్ర మద్దతు, కార్మికుల శ్రమతో ప్లాంట్ లాభాల బాట పట్టిందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: Srisailam : శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల వేళ అవ్యవస్థలు.. చంద్రబాబు ప్రభుత్వంపై భక్తులు, శివస్వాముల ఆగ్రహం
YS Jagan with Jogi Ramesh : అరాచకాలు ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తారా? నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు చర్యలు: జగన్ ధ్వజం
