Team India: భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్న ఒక్కటే… రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ (రో-కో) మళ్లీ ఎప్పుడు అంతర్జాతీయ వన్డేల్లో కనిపించబోతున్నారు? ప్రస్తుతం ఈ ఇద్దరు సీనియర్ స్టార్లు కేవలం వన్డే ఫార్మాట్కే పరిమితమయ్యారు. న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ ముగిసిన వెంటనే రోహిత్, కోహ్లీకి దాదాపు ఆరు నెలల విరామం దక్కనుంది. ఈ సమయంలో భారత జట్టు పూర్తి స్థాయిలో టీ20 క్రికెట్పై దృష్టి పెట్టనుంది.
టీ20లపైనే టీం ఇండియా ఫోకస్
కివీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ అనంతరం టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఆ తర్వాత వెంటనే ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ కారణంగా వన్డే మ్యాచ్లు లేకపోవడంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ నిర్ణయించింది.
అందువల్ల న్యూజిలాండ్ వన్డే సిరీస్ తర్వాత అభిమానులు రో-కోను మళ్లీ చూడగలిగేది ఐపీఎల్ వేదికపైనే. అంతర్జాతీయ క్రికెట్లో వారి రీఎంట్రీకి కొంత సమయం పడనుంది.
రో-కో రీఎంట్రీ ఎప్పుడంటే?
అంతర్జాతీయ షెడ్యూల్ను పరిశీలిస్తే, జూన్ లేదా జూలై నెలల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జూన్ నెలలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం భారత్కు రానుంది. ఈ సిరీస్లో రో-కో ఆడే అవకాశం ఉంది. అయితే యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఈ సిరీస్లో సీనియర్లకు విశ్రాంతి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. అలా జరిగితే, ఇంగ్లాండ్ పర్యటనలోనే రోహిత్ – కోహ్లీ తిరిగి మైదానంలోకి దిగే అవకాశం బలంగా ఉంది.
ఇంగ్లాండ్ సిరీస్పైనే ఫ్యాన్స్ చూపు
భారత్ ఇంగ్లాండ్ గడ్డపై వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్తోనే రో-కో రీఎంట్రీ అయితే అభిమానులకు అసలైన కిక్ దొరకనుందని చర్చ నడుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్తో పోలిస్తే ఇంగ్లాండ్తో మ్యాచ్లకు క్రేజ్ ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.
అంతేకాదు, ఇంగ్లాండ్ పరిస్థితుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అనుభవం టీం ఇండియాకు అత్యంత కీలకంగా మారనుంది.
ఇంగ్లాండ్లో రోహిత్ – కోహ్లీ రికార్డులు
ఇంగ్లాండ్లో రోహిత్ శర్మకు అద్భుతమైన వన్డే రికార్డు ఉంది.
27 వన్డేలు
1428 పరుగులు
సగటు: 64కి పైగా
7 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు
విరాట్ కోహ్లీ కూడా ఇంగ్లాండ్లో నిలకడగా రాణించాడు.
33 వన్డేలు
1349 పరుగులు
సగటు: 51.88
1 సెంచరీ, 12 అర్ధ సెంచరీలు
ఈ గణాంకాలే ఇంగ్లాండ్ సిరీస్లో వీరిద్దరిపై ఎందుకు అంత ఫోకస్ ఉందో చెబుతున్నాయి.
వన్డే వరల్డ్కప్ దిశగా ప్రణాళికలు
టీ20 ప్రపంచకప్ అనంతరం జరిగే ప్రతి వన్డే సిరీస్ను వన్డే వరల్డ్కప్ సన్నాహకంగా టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్ల ఫిట్నెస్, ఫామ్ చాలా కీలకం కానుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో కొనసాగుతున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే బ్యాటింగ్ చేస్తూ మరోసారి తమ క్లాస్ను నిరూపించారు.
ఇంగ్లాండ్ సిరీస్లోనూ అదే స్థాయిలో రాణించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ముందున్న సిరీస్లు
ఇంగ్లాండ్ పర్యటన అనంతరం భారత్ వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్ – నవంబర్ నెలల్లో న్యూజిలాండ్ టూర్ కూడా షెడ్యూల్లో ఉంది.
మొత్తానికి, రో-కో మళ్లీ అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టే క్షణం కోసం అభిమానులు ఇంకొన్ని నెలలు ఓపిక పట్టాల్సిందే.
ఇవీ చదవండి: Viral Video: చాలుపోరా సామీ.. టీమిండియాను ఊపేసిన విలన్ను సరదాగా గెంటేసిన విరాట్ కోహ్లీ
Virat Kohli: కింగ్ కోహ్లీ అభిమానులకు అలర్ట్.. ఆ మ్యాచ్కు విరాట్ దూరం.. అసలు కారణం ఏంటంటే!
