IPL 2027: భారత క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీ పేరు వినగానే ప్రశాంతత, నాయకత్వం, చమత్కారమైన సమాధానాలు గుర్తుకొస్తాయి. మైదానంలో తన నిర్ణయాలతో మ్యాచ్లను మలుపుతిప్పిన ‘తలా’.. మైదానం బయట కూడా తన హాస్యంతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటారు. తాజాగా ఓ కార్యక్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమాని అడిగిన ప్రశ్నకు ధోనీ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
‘CSKను పక్కన పెట్టి చెప్పండి.. IPL 2027 విజేత ఎవరు?’
ఇటీవల జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో అభిమానులతో ముచ్చటించిన ధోనీకి ఓ ఆర్సీబీ అభిమాని ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు. “IPL 2027 సీజన్ విజేత ఎవరో చెప్పండి. కానీ ఒక కండిషన్.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పేరును మాత్రం చెప్పకూడదు” అని కోరాడు. ఈ ప్రశ్న విన్న వెంటనే ధోనీ చిరునవ్వు చిందిస్తూ.. ఎలాంటి వివాదానికి తావివ్వకుండా తనదైన స్టైల్లో స్పందించాడు.
ధోనీ సమాధానం వైరల్
అభిమాని ప్రశ్నకు ధోనీ..”ఇలాంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పను. ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన జట్టును అభిమానించే హక్కు ఉంది.”అని నవ్వుతూ చెప్పారు. అంతటితో ఆగకుండా.. “మరి నువ్వు ఏ జట్టుకు ఫ్యాన్?” అని ధోనీ ఎదురు ప్రశ్నించారు. దానికి ఆ యువకుడు ఏమాత్రం వెనుకాడకుండా.. “నేను RCB ఫ్యాన్” అని గర్వంగా చెప్పడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ధోనీ కూడా చిరునవ్వుతో అతడిని అభినందించారు.
ధోనీ స్పందనపై అభిమానుల ప్రశంసలు
ధోనీ ఇచ్చిన సమాధానాన్ని అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఎలాంటి జట్టును తక్కువ చేసి మాట్లాడకుండా, ప్రతి ఫ్రాంచైజీ అభిమానులను గౌరవించే విధంగా స్పందించడమే ధోనీ గొప్పతనమని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
CSK, RCB మధ్య ఎప్పటి నుంచో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ.. అభిమానుల భావోద్వేగాలను గౌరవిస్తూ ధోనీ వ్యవహరించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది.
IPL 2026లో RCB చరిత్ర సృష్టించింది
IPL 2026 సీజన్లో రజత్ పాటిదార్ నాయకత్వంలోని RCB అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. 2025లో సాధించిన విజయాన్ని విజయవంతంగా నిలబెట్టుకుంటూ, వరుసగా రెండు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన జట్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత మూడో జట్టుగా నిలిచింది. దీంతో RCB అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి.
CSKకు మరో నిరాశాజనక సీజన్
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్కు 2026 సీజన్ అంతగా కలిసి రాలేదు. ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత జట్టు వరుసగా మూడోసారి ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది.
కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేక, పాయింట్ల పట్టికలో దిగువ స్థానాల్లోనే ముగించింది. దీంతో అభిమానులు 2027 సీజన్పై భారీ ఆశలు పెట్టుకున్నారు.
IPL 2027పై అప్పుడే అంచనాలు
IPL 2027 ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటికే అభిమానుల్లో చర్చ మొదలైంది. RCB హ్యాట్రిక్ టైటిల్ సాధిస్తుందా? లేక ముంబై, చెన్నై, కోల్కతా వంటి జట్లు తిరిగి పుంజుకుంటాయా? అనే చర్చలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి.
అయితే ధోనీ మాత్రం ఎలాంటి అంచనాలు వేయకుండా, అన్ని జట్ల అభిమానులను గౌరవించే సమాధానంతో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
ఇవీ చదవండి: MS Dhoni: ఒక్క మ్యాచ్ తలా.. అభిమానుల వెయిటింగ్.. ఇంకా మైదానంలోకి రాలేదెందుకు? CSK అభిమానుల్లో ఆందోళన
MS Dhoni: CSKకు భారీ షాక్: ఐపీఎల్ 2026 సీజన్లో మొదటి రెండు వారాలు ఎంఎస్ ధోని దూరం! కాల్ఫ్ స్ట్రెయిన్తో రిహాబ్లో థలా
MS Dhoni: బుడ్డోడు వర్సెస్ పెద్దోడు.. ధోని సేనకు సవాల్ విసిరిన వైభవ్ సూర్యవంశీ.. 4-0 చేస్తామని ధీమా
