Hyderabad Vijayawada Highway: తెలుగు రాష్ట్రాల మధ్య ప్రధాన రహదారిగా ఉన్న హైదరాబాద్–విజయవాడ నేషనల్ హైవే-65పై ప్రయాణించే వాహనదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు అధికారులు. పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల్లో కొన్ని వాహనాలపై టోల్ ఛార్జీలను తగ్గిస్తూ కొత్త రేట్లు ప్రకటించారు. ఈ కొత్త టోల్ ఫీజులు ఏప్రిల్ 1 అర్ధరాత్రి తర్వాత నుంచి అమల్లోకి రానున్నాయి.
1. ఏప్రిల్ 1 నుంచి కొత్త టోల్ రేట్లు
హైదరాబాద్–విజయవాడ నేషనల్ హైవే-65పై పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల్లో కొత్త టోల్ ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
2. కొన్ని వాహనాలపై రూ.5 తగ్గింపు
ప్రత్యేకంగా 3 యాక్సిల్ కమర్షియల్ వాహనాలపై టోల్ ఫీజును రూ.5 చొప్పున తగ్గించారు. ఇది వాహనదారులకు కొంత ఉపశమనం కలిగించనుంది.
3. పంతంగి టోల్ ప్లాజా కొత్త రేట్లు
పంతంగి టోల్ గేట్ వద్ద 3 యాక్సిల్ వాహనాలకు ఒకవైపు ప్రయాణం రూ.290 నుంచి రూ.285కు, రెండు వైపుల ప్రయాణం రూ.435 నుంచి రూ.430కు తగ్గింది.
4. కొర్లపహాడ్ టోల్ ప్లాజా మార్పులు
కొర్లపహాడ్ టోల్ వద్ద 3 యాక్సిల్ వాహనాలకు సింగిల్ ట్రిప్ రూ.450 నుంచి రూ.445కు, రెండు వైపుల ప్రయాణం రూ.675 నుంచి రూ.670కు తగ్గించారు.
5. కార్లు, జీపులు, లైట్ వాహనాల రేట్లు
పంతంగి వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు రూ.80, రెండు వైపులకు రూ.115గా ఉంది. కొర్లపహాడ్ వద్ద ఒకవైపు రూ.120, రెండు వైపులకు రూ.180గా కొనసాగుతుంది.
ఇవీ చదవండి: Hyderabad Crime: భార్యతో మాట్లాడాడనే అనుమానం.. స్నేహితుడిని ఏం చేశాడో తెలుసా?
Hyderabad Traffic: హైదరాబాద్ ట్రాఫిక్కు చెక్.. ORR చుట్టూ కొత్త శాటిలైట్ బస్టాండ్లు ఏర్పాటు
Rapido Hyderabad: హైదరాబాద్లో మెట్రో ప్రయాణాలకు కీలకంగా మారుతున్న రాపిడో సేవలు
