Harsh Roshan Sridevi: యువ నటులు Harsh Roshan మరియు Sridevi మరోసారి జంటగా నటించిన తాజా చిత్రం ‘Bandmelam’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దర్శకుడు Satish Javvaji తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హర్ష్ రోషన్, శ్రీదేవి కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఆసక్తికర చర్చ జరిగింది.
ఆఫ్స్క్రీన్లో కూడా ప్రేమేనా?
సినిమాలో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కనిపిస్తుండటంతో, వీరిద్దరూ నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ యాంకర్ నేరుగా ప్రశ్నించగా, ఇద్దరూ నవ్వుతూ స్పందించారు.
చైల్డ్ ఆర్టిస్టులుగా మొదలైన పరిచయం
హర్ష్ రోషన్ మాట్లాడుతూ.. తాము సినిమాల్లోకి రాకముందే పరిచయం ఉన్నట్టు తెలిపారు. “మేమిద్దరం చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్టులుగా పనిచేశాం. అప్పుడు నుంచే ఒకరికొకరం పరిచయం ఉంది. ఎలా మొదట పరిచయం అయ్యామో గుర్తు లేదు కానీ చాలా సంవత్సరాలుగా ఫ్రెండ్స్గా ఉన్నాం,” అని చెప్పారు.
ఫ్రెండ్స్ మాత్రమే
ఇక శ్రీదేవి మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న బంధం గురించి క్లారిటీ ఇచ్చింది. “మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకరికొకరం ‘ఒరేయ్’, ‘పోరా’ అంటూ పిలుచుకుంటాం. మా ఫ్రెండ్షిప్ చూసి చాలామంది మేము లవ్లో ఉన్నామని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చూసి మేము నవ్వుకుంటాం. కానీ మా మధ్య అలాంటి విషయం ఏమీ లేదు,” అని స్పష్టం చేసింది.
‘కోర్ట్’ సినిమా తర్వాత మరింత క్లోజ్
ఇద్దరూ కలిసి నటించిన ‘Court’ సినిమా తర్వాత తమ స్నేహం మరింత బలపడిందని చెప్పారు. ఆ సినిమా సమయంలోనే తాము బెస్ట్ ఫ్రెండ్స్గా మారామని తెలిపారు.
‘బ్యాండ్మేళం’పై అంచనాలు
దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ‘Bandmelam’ చిత్రం యువతను ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిందని సమాచారం. ట్రైలర్కు ఇప్పటికే మంచి స్పందన రావడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. మార్చి 26న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత గట్టి సౌండ్ చేస్తుందో చూడాలి.
ఇవీ చదవండి: Actress Sridevi : ఆ హీరో అభిమానులను ఆకర్షించిన కుర్ర హీరోయిన్.. సోషల్ మీడియాలో క్రేజ్
Janhvi Kapoor: పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించిన జాన్వీ కపూర్.. సౌత్ సినిమాలపై దృష్టి
Janhvi Kapoor : జాన్వీ లేటెస్ట్ ఫొటో షూట్ వైరల్.. అందాల దేవత!
