HomeInternationalHong Kong Fire Accident: హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం: 44 మంది మృతి, 279 మంది...

Hong Kong Fire Accident: హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం: 44 మంది మృతి, 279 మంది అదృశ్యం — ఎలా జరిగింది ఈ విషాదం?

Hong Kong Fire Accident: హాంకాంగ్‌లోని తై పో ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదం తీరేంటో చెప్పలేనంత విషాదంగా మారింది. వాంగ్ ఫక్ కోర్ట్ అనే పెద్ద నివాస సముదాయంలో మంటలు చెలరేగి 44 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు, ఇంకా 279 మంది కనిపించకుండా పోయారు అని అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. గాయపడిన వారందరినీ సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

మంటలు త్వరగా వ్యాపించడానికి అసలు కారణాలేమిటి?
వాంగ్ ఫక్ కోర్ట్‌లో మొత్తం 8 బ్లాకులు, ప్రతి బ్లాక్‌లో 31 అంతస్తులు ఉన్నాయి. దాదాపు 2,000 అపార్ట్‌మెంట్లలో 4,800 మంది నివసిస్తున్నారు. మంటలు భారీ వేగంతో వ్యాపించడానికి ఆధికారులు సూచించిన ముఖ్య కారణాలు ఇవి:
అపార్ట్‌మెంట్‌ల బయటి గోడలను వెదురు బొంగులతో నిర్మించడం
నిర్మాణ సమయంలో వాడిన సేఫ్టీ నెట్‌ను తొలగించకపోవడం
ఘటన సమయంలో బలమైన గాలులు వీస్తుండటం, అగ్నికీలలు ఒక టవర్‌ నుంచి మరొకటికి వ్యాపించడానికి దోహదపడింది
ఈ అన్ని కారణాల వల్ల మంటలు క్షణాల్లోనే అనేక బ్లాకులను కమ్మేశాయి.

ముగ్గురు అనుమానితుల అరెస్ట్
ఈ ఘోర ప్రమాదంపై హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ స్పందించారు. అదృశ్యమైన వారి కోసం శోధన కొనసాగుతోందని తెలిపారు. అగ్నిప్రమాదం ఎలా జరిగింది అన్న విషయం తెలుసుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నియమించబడింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్టు భావించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఈ ఘటనపై సంతాపాన్ని ప్రకటించారు.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో భవనం అంతా మంటల్లో మునిగిపోయిన దృశ్యాలు, ఆకాశాన్నంటిన పొగ కనిపిస్తున్నాయి. ఘటనతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం:
700 మంది అగ్నిమాపక సిబ్బంది
పోలీస్, భద్రతా బృందాలు

ఉద్ధర పనుల్లో పాల్గొంటున్నాయి.
ఏకంగా 90% మంది నివాసితులను సురక్షితంగా బయటకు తరలించామని అధికారులు వెల్లడించారు.

హాంకాంగ్ చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటి
ఈ అగ్నిప్రమాదం హాంకాంగ్ గతంలో జరిగిన ప్రధాన విపత్తులతో సమానంగా ఉందని అధికారులు చెబుతున్నారు. సుమారు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంతటి తీవ్రత గల లెవల్ 5 ఫైర్ అలర్ట్ ప్రకటించడం ఇదే మొదటిసారి. గతంలో లెవల్ 5 అగ్నిప్రమాదంలో నలుగురు మాత్రమే మృతిచెందగా, ఈసారి పరిస్థితి ఎన్నడూ లేనంత భయంకరంగా మారింది.

అగ్నిమాపక శాఖ సమీప నివాసితులకు ఇళ్లలోనే ఉండి తలుపులు, కిటికీలను మూసుకోవాలని సూచించింది.

ఇవీ చదవండి: Kurnool bus fire : కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం: కావేరి ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయి 20 మందికి పైగా మృతి
Viral video : సముద్రంలో అగ్నిపర్వతం పేలుడు.. షాకింగ్ వీడియో!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు