PM Modi : మంగళవారం (నవంబర్ 25న) ప్రధాని మోదీ హర్యానాలోని కురుక్షేత్రలో పర్యటించారు. ఈ సందర్భంగా జ్యోతిసర్ అనుభవ కేంద్రం, పాంచజన్య శంఖ్ స్మారక చిహ్నంను ప్రారంభించారు. అనంతరం జరిగిన గురు తేగ్ బహదూర్ 350వ అమరవీరుల వార్షికోత్సవ సభలో పాల్గొని, ఆయనకు అంకితమైన పుస్తకాన్ని విడుదల చేశారు. అలాగే ప్రత్యేక స్మారక నాణెం కూడా ఆవిష్కరించారు.
ప్రసంగంలో ప్రధాన మంత్రి మోదీ మాట్లాడుతూ— గురు తేగ్ బహదూర్ సత్యం, న్యాయాన్ని తన మతంగా భావించి వాటి రక్షణ కోసం తన ప్రాణాల వరకు ధారపోశారని గుర్తుచేశారు. “మా గురువులు ఇచ్చిన మంత్రం—ఎవరినీ బెదిరించకూడదు, భయపడకూడదు. మేము శాంతిని కోరుకుంటాం కానీ దేశ భద్రత విషయంలో ఒక అడుగు కూడా వెనక్కి వెళ్లం. దీనికి ‘ఆపరేషన్ సింధూర్’ పెద్ద ఉదాహరణ. ప్రపంచం అంతా అది చూశింది. నూతన భారత్ ఎప్పటికీ భయపడదు… పూర్తి శక్తితో ముందుకు సాగుతుంది” అని స్పష్టం చేశారు.
మోదీ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు.
“భారతీయ వారసత్వం ఓ అద్భుత సంగమం. ఈ ఉదయం నేను అయోధ్యలో—రామాయణ నగరంలో—ఉండగా, ఇప్పుడు గీతా జన్మభూమి కురుక్షేత్రలో ఉన్నాను. గురు తేగ్ బహదూర్ జీ అమరవీరుల దినోత్సవం సందర్బంగా ఆయనకు నివాళులర్పించడం నా అదృష్టం. 2019 నవంబర్ 9న రామమందిరంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు కూడా ఒక అద్భుత అనుబంధం. ఆ తీర్పుకు ముందు రామమందిర నిర్మాణం ప్రారంభం కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను… అదే రోజున తీర్పు వెలువడింది. ఈ రోజు అయోధ్యలో ధర్మద్వజం ఎగురవేసినప్పుడు, ఇక్కడి ప్రజల ఆశీస్సులు నాకు లభించాయి” అని తెలిపారు.
మోదీ మరింతగా చెప్పారు—
“సత్యం కోసం, ధర్మం కోసం ప్రాణత్యాగం చేయడం ఉత్తమమైనది అని శ్రీకృష్ణుడు ఈ కురుక్షేత్ర భూమిపైనే ఉపదేశించారు. అదే మార్గాన్ని గురు తేగ్ బహదూర్ జీ అనుసరించారు. వారి గౌరవార్థం తపాలా బిళ్ళ, ప్రత్యేక నాణెం విడుదల చేయడం ఈ సందర్భానికి మరో ఘనతను జోడించింది. కురుక్షేత్రం సిక్కు సంప్రదాయానికి ముఖ్య కేంద్రం” అని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: Go Back Modi : తమిళనాట గో బ్యాక్ మోదీ.. మెట్రో ప్రాజెక్టుల డెడ్లీక్లపై ఆగ్రహం
Sri Sathya Sai : శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ: సేవే పరమధర్మం అనేది బాబా చూపించిన మార్గం
PM Modi : పీఎం మోదీ దాతృత్వం: పుట్టపర్తి రైతులకు గుజరాత్ జీఐఆర్ ఆవుల విరాళం
