Asia Cup 2025: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న అబుదాబిలో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య జరిగిన మ్యాచ్తో అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఎడిషన్ టీ20 ఫార్మాట్లో జరుగుతోంది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంకాంగ్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. పోటీ ఉత్కంఠభరితంగా సాగుతుండగా, ప్రైజ్ మనీపై కూడా అభిమానుల్లో ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది.
విజేత, రన్నరప్ ప్రైజ్ మనీ
నివేదికల ప్రకారం, ఈసారి విజేత జట్టు రూ. 2.60 కోట్లు గెలుచుకోనుంది. రన్నరప్గా నిలిచిన జట్టుకు రూ. 1.30 కోట్లు లభిస్తాయి. అయితే, ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ఇంకా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. గత ఎడిషన్ (2024)లో విజేత జట్టుకు రూ. 1.5 కోట్లు, రన్నరప్ జట్టుకు రూ. 82 లక్షలు లభించాయి. ఈసారి మొత్తాలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.
భారత్ ఘన ఆరంభం
భారత్ తమ తొలి మ్యాచ్లో (సెప్టెంబర్ 10) యూఏఈపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత పాకిస్తాన్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 7 వికెట్ల తేడాతో సులభంగా గెలిచి మంచి ఊపుమీద ఉంది. ఇప్పటికే ఎనిమిది సార్లు ఆసియా కప్ కైవసం చేసుకున్న భారత్, ఈసారి కూడా బలమైన పోటీదారుగా కనిపిస్తోంది.
తదుపరి మ్యాచ్
భారత్ తమ చివరి గ్రూప్ మ్యాచ్ను దుబాయ్లోని షేక్ జాయెద్ స్టేడియంలో ఒమన్తో ఆడనుంది. వరుస విజయాలతో జట్టు మోరల్ హైలో ఉంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సమతుల్యత కనబరుస్తోంది. ఈసారి కూడా టైటిల్ గెలిచి, ఆసియా కప్ ట్రోఫీని మరోసారి ఎత్తుకుంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: Asia Cup 2025 : హాంకాంగ్ పై అఫ్గానిస్థాన్ సంచలనం.. ఆసియా కప్లో రికార్డులు!
Asia Cup 2025: టీమిండియా మ్యాచ్లలో బ్యూటీ లేడీ.. కోహ్లీతో కనెక్షన్ ఏంటి?
