YS Jagan with BC’s: బీసీల సంక్షేమం కోసం సీఎం జగన్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఏలూరు బీసీ డిక్లరేషన్కు కట్టుబడి వారి కోసం ప్రత్యేకంగా మేలు చేకూరుస్తోంది. జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి బీసీలకు జరిగిన మేలు ఇదీ.. (YS Jagan with BC’s)
* నాలుగేళ్లలో డీబీటీ ద్వారా రూ.1,14,301.08 కోట్ల లబ్ధి.
* నాన్డీబీటీ ద్వారా మరో రూ.50,258.06 కోట్ల లబ్ధి
* డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.1,64,559.13 కోట్ల లబ్ధి.
* బీసీ అక్కచెల్లెమ్మలకు 16,70,286 ఇంటి స్థలాలు. (56 శాతం)
* మొదటి విడత మంత్రివర్గంలో 14 మంది బీసీ మంత్రులు (56 శాతం).
* రెండో విడత మంత్రివర్గంలో 11 మంది బీసీలకు మంత్రి పదవులు.
* నలుగురు బీసీలకు రాజ్యసభ సీట్లు.
* శాసనసభ స్పీకర్ పదవి.
* దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు.
* 13 కార్పొరేషన్లలో 7 చోట్ల మేయర్ పదవులు.
* 139 బీసీ కులాల పేర్లతో 56 కార్పొరేషన్లు.
* స్థానిక సంస్థల ఎన్నికలు 648 మండలాలకు జరిగితే 637 గెలుపు. ఇందులో 237 అంటే 38 శాతం బీసీలకు ఎంపీపీ పదవులు.
* 13 జిల్లా పరిషత్ చైర్మన్లలో 6 పదవులు (46 శాతం) బీసీలకే.
* 14 నగర కార్పొరేషన్ మేయర్ పదవుల్లో 9 పదవులు (64 శాతం) బీసీలకు.
* 87 మున్సిపాలిటీలకు 84 వైయస్సార్సీపీ గెలుపు. ఇందులో 44 మునసిపాలిటీలు (53 శాతం) బీసీలకు.
* 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల్లో 76 అంటే (39 శాతం) బీసీలకు.
* వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 పదవులు (39 శాతం బీసీలకే. వీటిలో 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవులుంటే 201 (41 శాతం) బీసీలకే.
* 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 2,650 పదవులు (38 శాతం) బీసీలే.
* తిరుమల ఆలయంలో సన్నిధిగొల్లలకు తలుపులు తెరిచే సంప్రదాయ హక్కు కల్పన.
* కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగళి తదితర వృత్తుల్లో ఉన్న వారి సర్వీసు ఈనాం భూముల సమస్యను పరిష్కరిస్తూ (దేవాలయాలు, ఇతర సంస్థలకు సంబంధించినవి) 22ఏ నుంచి తొలగింపు. పూర్తి హక్కుల కల్పన. మొత్తంగా 1,58,113 ఎకరాలకు 1,61,584 మంది బీసీ రైతన్నలకు మేలు.
