Tirumala Samacharam 25-07-2025: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీనివాసుడిని 73,796 మంది భక్తజనం దర్శనం చేసుకున్నారు. అలాగే 28,840 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారికి హుండీ ఆదాయం రూ.5 కోట్లు వచ్చింది. (Tirumala Samacharam 25-07-2025)
తిరుపతి నుంచి తిరుమల వెళ్లే ఘాట్ రోడ్డులో ప్రమాదం
తిరుమతి నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్ రోడ్డులో ఈ దుర్ఘటన జరిగింది. ముందు వెళ్తున్న కారును వెనుక వైపు వస్తున్న మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గరుడాద్రి నగర్ కాటేజెస్ టోల్గేటు సమీపంలో ఈ ఘటన వెలుగుచూసింది. కారు ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి.
Read Also : Gold Price today 25 July 2023: ఈరోజు బంగారం ధరల్లో మార్పు లేదు.. పసిడి ధరలు ఇలా..
