CM Jagan Meeting with Officials: ఏపీ విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై ఇవాళ కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై నిన్న సీఎం జగన్, చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్రెడ్డితోపాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. (CM Jagan Meeting with Officials)
* రాష్ట్ర విభజన వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం జరిగింది.
* విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా చట్టంలో పేర్కొన్న అంశాలు అలానే ఉన్నాయి.
* ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.
* అప్పుల్లో 58శాతం ఏపీకి, 42 శాతం తెలంగాణకు కేటాయించారు.
* కానీ రెవిన్యూ పరంగా 58 శాతం తెలంగాణకు, 42 శాతం ఏపీకి వచ్చింది.
* పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం ఆదాయాలు ఏ రకంగా పెరుగుతాయి.
* ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు, పోలవరంకు నిధుల రాకలో సమస్యలున్నాయి.
* తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు కూడా రాలేదు.
* మరి విభజన కష్టాల నుంచి రాష్ట్రం ఏవిధంగా బయటకు రాగలుగుతుంది.
* పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కూడా సమావేశంలో దృష్టిపెట్టాలి.
* విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే కదా విభజన చట్టంలో హామీలు ఇచ్చారు.
* హైదరాబాద్ రూపేణా పారిశ్రామిక, రోడ్డు రవాణా, విద్యా సంస్ధల పరంగా ఇలా అన్నిరకాల మౌలిక సదుపాయాలను కోల్పోయాం.
* దీనివల్ల రాష్ట్రానికి రెవిన్యూ రూపంలో చాలా నష్టపోయాం. దీన్ని సర్దుబాటుచేస్తూ విభజన చట్టంలో ఆయా రంగాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు హామీలు ఇచ్చింది.
* విభజన చట్టంలో ఉన్న ఈ స్ఫూర్తి ఇప్పుడు అమల్లోకూడా కనిపించాల్సిన అవసరం ఉంది.
* ఇవి నెరవేరితే రాష్ట్రంలో పలు వసతులు సమకూరుతాయి. తద్వారా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి.
* రెవెన్యూ క్రమంగా పెరుగుతూ వస్తుంది. రాష్ట్రం పురోగమిస్తేనే దేశంకూడా పురోగమిస్తుంది.
* ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పట్ల కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేకత చూపించాల్సిన అవసరం ఉంది.
* అప్పుడే విభజన నష్టాల నుంచి గట్టెక్కగలుగుతుంది.
* అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానులను ప్రకటించాం.
* ఈ ప్రాంతాల మధ్య సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి మన బాధ్యత.
* మూడు ప్రాంతాలను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.
* ఇప్పటికే పలు రోడ్లు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
* భవిష్యత్తులో కూడా వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది.
* ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైన సహకారం, సహాయం అవసరం. దీనికోసం సమావేశంలో కేంద్రాన్ని గట్టిగా కోరాలి.
* కొత్తగా సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీని కోరుతున్నాం. కచ్చితంగా ఇది వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలి.
* దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణంపై కేంద్రం హామీ ఇచ్చింది. వీటన్నింటికోసం దీనికోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి.
* కడపలో స్టీల్ప్లాంట్పై కేంద్రం హామీ ఇచ్చింది. స్టీల్ ప్లాంటుకు సమీప ప్రాంతంలో ఎన్ఎండీసీ నుంచి గనుల కేటాయింపు చేయాలి.
* దీంతో ప్రతిపాదిత ఫ్యాక్టరీ నిర్మాణానికి మార్గం సులభతరం అవుతుంది.
* విశాఖపట్నం నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం హై స్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది.
* విశాఖపట్నం – వయా ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం ఒత్తిడి తీసుకురావాలి.
* దీనివల్ల మూడు ప్రాంతాల మధ్య రాకపోకలు అత్యంత సులభతరం అవుతాయి. విశాఖ రైల్వే జోన్అంశంపై కూడా దృష్టిపెట్టాలి.
* వైజాగ్, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మారుస్తానన్నారు.
* విశాఖపట్నంలో నేవీ కార్యకలాపాల వల్ల పౌరవిమానాలకు తీవ్ర ఇబ్బంది వస్తోంది.
* దీంతో ఎయిర్ పోర్టును వేరేచోటకు బదిలీచేయాల్సిన అవసరం ఏర్పడింది.
* ప్రస్తుతం భోగాపురం ఎయిర్ పోర్టును నిర్మిస్తున్నారు. ఈ ఎయిర్ పోర్టుకు కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం.
* మంచి రహదారి ఏర్పాటుకు కేంద్రం ఇతోధికంగా సహాయం అందించాల్సిన అవసరం ఉంది.
* విశాఖ సిటీనుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు అనుసంధానం చేసే రహదారి అంశంపై కేంద్రంతో జరుగుతున్న సమావేశంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
* భోగాపురం ఎయిర్ పోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భూ సేకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
* విజయవాడ లాంటి ఎయిర్ పోర్టుల్లోనూ భూ సేకరణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది.
* విశాఖ మెట్రో రైలు అంశాన్నికూడా కొలిక్కి తీసుకురావాలి.
* ప్రైవేట్ డెవలపర్ 60 శాతం భరిస్తున్నందున, భూ సేకరణ సహా మిగిలిన 40 శాతం కేంద్రం భరించేలా గట్టిగా ఒత్తిడి తీసుకురావాలి.
* రెండు రాష్ట్రల మధ్య ఆస్తుల విభజన ఇంకా పెండింగ్లో ఉంది. దీనికోసం ఒత్తిడి తీసుకురావాలి.
* వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా దృష్టిపెట్టాలి.
ఇదీ చదవండి: Vizag boat Fire Accident: సీఎం జగన్ ఉదారత.. బోట్లు కోల్పోయిన విశాఖ మత్స్యకారులకు 80 శాతం సాయం