Tirumala Samacharam (24-07-2023): నేడు ఆన్‌లైన్‌లో అక్టోబర్ దర్శన డికెట్లు విడుదల.. సర్వదర్శనానికి 12 గంటలు

Tirumala Samacharam (24-07-2023): అక్టోబర్‌ మాసానికి సంబంధించి దర్శన టికెట్లను నేడు ఆన్‌లైన్‌ ద్వారా టీటీడీ విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల చేశారు. అలాగే ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్లు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేస్తారు. అలాగే రేపు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేయనున్నారు. (Tirumala Samacharam (24-07-2023)

Read Also : Gold Price today 24 July 2023: దిగిరానంటున్న బంగారం ధర.. నేడు పసిడి, వెండి రేట్లు ఇవీ..

శ్రీవాణి దాతలకు దర్శనం, వసతి కేటాయింపు చేయనుంది టీటీడీ. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు అదనపు కోటాను రేపు ఉ.10 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

Read Also : Devotional Tip: శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం.. ఎన్ని అప్పులున్నా ఈ మంత్రాన్ని పుస్తకంలో రాసుకొని చదవండి.. సకల శుభప్రదం!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles